Friday, September 24, 2010

జపమునకు ఆసన ప్రాధాన్యత


కంబళి


జపం లేదా పూజ చేసేటప్పుడు ఆసనం వేసుకుని దానిపై కూర్చుని చేయాలి. ఆ ఆసనం గురించి కొంత తెలుసుకోవడం ఉత్తమం. దర్భాసనము వేసుకుని, దానిపై తెల్లని వస్త్రం వేసుకుని జపం చేయడం ఉత్తమం. కొందరు క్రమంగా దర్భాసనం, కంబళి, వస్త్రం వేసుకుని జపం చేస్తారు.

కేవలం పీట వేసుకుని జపం చేయడం మంచిది కాదు. "దరిద్రం దారుకాసనం" అన్నారు. పీటపై వస్త్రం వేసుకుని చేసుకోవాలి. పీట ౯ అంగుళాల ఎత్తులో చేయించుకుంటే మంచిది అంటారు. అలా చేయడం వలన భూమ్యాకర్షణ శక్తికి లొంగక మన మనస్సు భగవంతునిపై లగ్నమవుతుంది.
దర్భాసనం


యోగులు దర్భాసనం వేసుకుని, దానిపై కృష్ణాజినం (జింకచర్మం) మరల దానిపై తెల్లని వస్త్రం వేసుకుని జపం చేసుకునేవారు.

మీరు కూడా కృష్ణాజినం ప్రయత్నించేరు సుమా! ఆ పని మాత్రం చేయకండి. మన జపం చిన్న జీవికి కూడా హాని కలింగించ కూడదు. అలా జరిగిన నాడు ఆ జపం నిష్ఫలం.

ఇక ఆసనం గురించి మీకు తెలిసిన విషయాలు కూడా చెప్పండి మరి.

1 comment: